చరిత్ర
మన రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కొన్ని రెవిన్యూ డివిజన్లు ఉన్నాయి. అవి రెవిన్యూ డివిజినల్ అధికారి (ఆర్.డి.వో. లేదా సబ్ కలెక్టర్ ) పాలనలో ఉంటాయి. ఒక్కో డివిజన్ లో కొన్నిమండలాలు ఉంటాయి. మండలాల్లో తహసీల్దారులు (పూర్వం ఎం.ఆర్.ఓ, ) ఉంటారు. భూమి శిస్తు వసూలు, జమాబందీ, చౌకడిపో డీలర్ల నియామకం, శాంతి భద్రతలు,భూసేకరణ , రెవిన్యూ కోర్టుల నిర్వహణ, పంచాయతీ ల పర్యవేక్షణ, ఆహారధాన్యాల కొనుగోలు, జనాభా లెక్కల సేకరణ, ఎన్నికల నిర్వహణ, పొదుపు పధకాలు, పెన్షన్లు, సినిమాహాళ్ళ లైసెన్సులు, పంచనామా లు, భూతగాదాలు, ఇలా ఎన్నో పనులకు రెవిన్యూ డివిజినల్ అధికారులు కలెక్టర్ తరుపున తహసీల్దారుల లాగానే హాజరవుతూ ఉంటారు. ఏ శాఖా ప్రాతినిధ్యం వహించని పనులు ఈ అధికారే సాధారణ పరిపాలకునిగా చేపడుతుంటారు. 1956 లో ఒక్కొక్క రెవిన్యూ డివిజినల్ అధికారి 4 లక్షల ప్రజల అవసరాలకు హాజరయ్యేవాడు. ఇప్పుడు 11 లక్షల మంది కి పైనే ప్రజలు ఒక్కొక్క ఆర్.డి.ఓ. పరిధిలో ఉంటున్నారు. ఐ.ఏ.ఎస్. అధికారుల్ని ముందు రెవిన్యూ డివిజినల్ అధికారులుగానే నియమిస్తారు. అప్పుడు వాళ్ళను సబ్ కలెక్టర్ అంటారు. ప్రతి జిల్లాలో సబ్ కలెక్టర్ కోసం ఒక రెవెన్యూ డివిజన్ ఉంటుంది. ఏ.పి.పి.యస్.సి. ద్వారా గ్రూప్1 పరీక్షలు పాసై వచ్చే డిప్యూటీ కలెక్టర్లను రెవిన్యూ డివిజినల్ అధికారులుగా నియమిస్తారు. తహసీల్దారులకు కూడా ప్రమోషన్ ఇచ్చి రెవిన్యూ డివిజినల్ అధికారులుగా నియమిస్తారు. పూర్వంబ్రిటీష్ పాలకులు భూమిశిస్తు వసూళ్లకోసం నియమించుకున్నవారే కలెక్టర్లు. ఇప్పుడు భూమిశిస్తు వసూళ్ల ప్రాధాన్యత తగ్గిపోయి సంక్షేమ కార్యక్రమాల అమలుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి కలెక్టర్లు జిల్లాల ప్రగతి రధ సారధులయ్యారు. కలెక్టర్ల సహాయకులే ఈ సబ్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్.డీ.ఓలు.రెవిన్యూ డివిజన్ల సంఖ్య జనాభాకు అణుగుణంగా పెరగాల్సి ఉంది.రైలు మార్గం డివిజన్ కేంద్రాలన్నిటికీ విస్తరించాలి.హైదరాబాద్ చుట్టుపక్కల 6 మండలాల్లో డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దారులుగా పనిచేస్తున్నారు.అలా కాకుండా ప్రతి ఎమ్మెల్యే నియోజక వర్గాన్నీ ఒక డివిజన్ గా ప్రకటిస్తే బౌగోళిక సరిహద్దులు ఎమ్మెల్యేకి, డిప్యూటీ కలెక్టర్ కు సమానంగా ఉంటాయి. పాలనా వ్యూహాలు ఉమ్మడిగా రూపొందిస్తారు.ఇద్దరూ ఒకే ప్రాంగణంలో ప్రజలకు దొరుకుతారు.ఎమ్మెల్యేలకు కూడా కార్యాలయ భవనాలు శాశ్వతంగా ఏర్పడతాయి.ఒక్కొక్క శాసన సభ నియోజకవర్గం రెండు మూడు రెవిన్యూ డివిజన్ల పరిధిలోకాకుండా ఒకే రెవిన్యూ డివిజన్ పరిధిలోకి వచ్చేలా, మరీజనాభా ఎక్కువైతే కొత్త డివిజన్లు ఏర్పాటు చేసేలా పునర్వ్యవస్తీకరించటానికి ప్రభుత్వం ల్యాండ్ రెవిన్యూ కమీషనర్ అధ్యక్షతన కమిటీని నియమించింది.(వార్త 28.7.2008).
- జాయింట్ కలెక్టర్ ల పై పనిభారం తగ్గించేందుకు 22 అదనపు జాయింట్ కలెక్టర్లు(నాన్ కేడర్) ను నియమించారు.
అప్పగించిన బాధ్యతలు:
- జిల్లా స్థాయిలో సాంఘిక, బీసీ, మహిళా, శిశు, వికలాంగ, గిరిజన, మైనారిటీ, యువజన సంక్షేమానికి సంబంధించిన పథకాలు.
- బలహీనవర్గాల ప్రజల ఇళ్ల నిర్మాణం కోసం జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు భూసేకరణ
- బలహీనవర్గాల గృహనిర్మాణం
- దేవాదాయ, విద్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖలకు సంబంధించిన వ్యవహారాలు
- వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య శాఖల పథకాలు, కార్యక్రమాల పర్యవేక్షణ
- కోనేరు రంగారావు కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడం.
కొత్త రెవెన్యూ డివిజన్లకు మార్గదర్శకాలు
- ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో 10-15 మండలాలు, 2-3 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉంటాయి. చిట్టచివరి మండలం కూడా రెవెన్యూ డివిజన్ కేంద్రానికి 70 కిలోమీటర్ల పరిధిలోనే ఉండాలి.
- గిరిజన ప్రాంతాల్లోనైతే ఈ దూరం 50-60 కిలోమీటర్లలోపు ఉండేలా చూడాలి.వీలైతే ఏజెన్సీ మండలాలన్నీ ఒక రెవెన్యూ డివిజన్ కిందకు తీసుకురావాలి, పట్టణ ప్రాంతాల్లో 7-9 మండలాలతోనే ఒక డివిజన్ ఏర్పాటు చేయాలి.
- డివిజన్ కేంద్రం దాని కిందకు వచ్చే మండలాలకు మధ్యలో ఉండాలి. (ఈనాడు2.6.2011)
రెవిన్యూ డివిజన్లలో దొరికే సమాచారం
- భూముల కబ్జాదారుల వివరాలు, ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకున్నభూమి వివరాలు.
- భూములపై కోర్టులో పెండింగ్ కేసులు.
- పట్టాదారు పుస్తకాలు , రేషన్ కార్డులు ఉన్న వారి వివరాలు.
- కుల,నివాస,ఆదాయ,పహాణీ, అడంగళ్ ధృవీకృత పత్రాలు.
- మిగులు భూముల వివరాలు.
- అసైన్డ్ భూముల జాబితా, యజమానుల వివరాలు.
- ఆపద్భందు పథకం అర్హతలు, నమూనా దరఖాస్తు పత్రాలు.
- ముఖ్యమంత్రి సహాయ నిధి అర్హతలు, లబ్ధిదారుల వివరాలు.
- ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయిన రైతులకు చెల్లించిన పరిహారం, రైతుల పేర్లు, చిరునామాలు.
- భూభారతి పథకం సర్వే వివరాలు.
- ప్రభుత్వ భూముల వివరాలు.భూసేకరణ వివరాలు,
- బడుగు, బలహీన వర్గాల కోటాలో నివాస స్థలాలు పొందిన లబ్ధిదారుల పేర్లు, చిరునామాలు, అర్హతలు.
- ప్రభుత్వ భూముల కోసం దరఖాస్తు చేసుకున్న అర్జీదారుల వివరాలు.
- సినిమా హాళ్లలో కనీస వసతుల వివరాలు
- బాలికా సంరక్షణ పథకం (జీపీఎస్)
- పాముకాట్లు, అగ్ని ప్రమాదాలు, చెట్లు మీద పడటం తదితర కారణాల వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు వ్యక్తిగత ప్రమాద భీమా పథకం(పీఏఐఎస్)
- కలెక్టర్ కార్యాలయంలో
- ఆయుధ లెసెన్సులు కలిగి ఉన్న వారి వివరాలు
- గ్రీవెన్స్సెల్లలో ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలపై తీసుకున్న చర్యలు
- కరవు నిధుల ఆడిట్ వివరాలు, డైక్లాడ్ సమాచారం
- ప్రధానమంత్రి సహాయ నిధి, లబ్ధిదారుల వివరాలు
- ఆపద్బంధు తదితర పథకాల లబ్ధిదారుల వివరాలు
- శాంతిభద్రతల సమీక్ష వివరాలు, తనిఖీ నివేదికలు
- స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన సమాచారం
- తహశీల్దార్ ..కార్యాలయంలో
- చౌక ధరల దుకాణాల వివరాలు
- అసైన్డ్ భూములు, పట్టాదారు పాసు పుస్తకాల సమాచారం
- గనుల వివరాలు, రిజర్వు స్థలాలు, జమాబంధి వివరాలు
- రెవెన్యూ రికార్డులు, 1968 ఏపీ నాలా చట్టానికి సంబంధించిన సమాచారం
- వీఆర్వో ..కార్యాలయంలో
- 11 రకాల 'గ్రామ లెక్క'లతో కలుపుకుని మొత్తం 18 రకాల రికార్డుల వివరాలు
- అడంగల్/ పహాణీ, రేషన్ కార్డులున్న వారి చిరునామాలు
డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దార్లు గా పనిచేసే మండలాలు
- 1.సరూర్ నగర్
- 2.కుత్బుల్లాపూర్
- 3.హయత్ నగర్
- 4.శేరిలింగంపల్లి
- 5.రాజేంద్రనగర్
- 6.బాలానగర్
రైలు మార్గాలు లేని రెవిన్యూడివిజన్ కేంద్రాలు
- శ్రీకాకుళం
- మెదక్
- భద్రాచలం
- అమలాపురం
- నాగర్ కర్నూల్
- ఉట్నూర్
- బోధ్
- పాలకొండ
- చేవెళ్ళ
- నారాయణపేట
- వనపర్తి
- జమ్మలమడుగు
- మదనపల్లి
- కందుకూరు
- కొత్తగూడెం
- పరకాల
- నర్సీపట్నం
- పాడేరు
- సూర్యాపేట
- రంపచోడవరం
- జంగారెడ్డిగూడెం
- పాల్వంచ
- సంగారెడ్డి
రెవిన్యూడివిజన్ కేంద్రాలుగా లేని లోక్సభ నియోజకవర్గాలు
- అనకాపల్లి విశాఖపట్నం డివిజన్
- అరకు పాడేరు డివిజన్,
- జహీరాబాదు కామారెడ్డి డివిజన్
- బాపట్ల తెనాలి డివిజన్
- మల్కాజ్గిరి సికిందరాబాద్ డివిజన్
- హిందూపురం ధర్మవరం డివిజన్
- రామగుండం మంచిర్యాల డివిజన్
- ఆంధ్ర లో రెవిన్యూడివిజన్ కేంద్రాలు =30,రాయలసీమ లో రెవిన్యూడివిజన్ కేంద్రాలు =13,తెలంగాణా లో రెవిన్యూడివిజన్ కేంద్రాలు = 39
ఆంధ్ర,రాయలసీమ,తెలంగాణా
ఆన్ లైన్ లో రెవిన్యూ సేవలు
రెవెన్యూలో కీలక సేవలన్నీ ఆన్లైన్లోనే అందజేయటానికి 2011 అక్టోబర్ 2 నుంచి ప్రారంబించబోతున్నారు. పౌర సేవలతో పాటు పరిపాలనకు సంబంధించిన పనులు, ఉత్తర ప్రత్యుత్తరాలు, పైళ్ల నిర్మాణం, భూమి రికార్డులు, జమాబందీ, పాస్ పుస్తకాలు ద్రువపత్రాలు, పాస్ పుస్తకాల కంప్యూటరీకరణ, సీసీఎల్ఏ నుంచి తహసిల్దార్ వరకు ఈ మెయిల్ ఖాతాలు ఉత్తర ప్రత్యుత్తరాలు వంటి వాటిని పూర్తి స్థాయిలో ఆన్లైన్ పరిధిలోకి తీసుకురానున్నారు. ఈ మేరకు ఐటీ శాఖతో అనుసంధానంగా రెవెన్యూ శాఖ కసరత్తు మొదలుపెట్టింది.
భూముల రిజిస్ట్రేషన్లలో రిజిస్ట్రేషన్ శాఖకు, తహసిల్దార్లకు ఏమాత్రం సమన్వయం, సమాచారం ఉండడం లేదు. దీంతో, రిజిస్ట్రేషన్ చేస్తున్న భూమి ప్రభుత్వానిదా? అసైన్మెంట్దా? పోరంబోకా? అన్నది తెలియడం లేదు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. తహసిల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేయాలని భూముల క్రయ, విక్రయాల్లో రెండు శాఖల మధ్య సమన్వయం తీసుకొస్తున్నారు. పౌరులకు అందించే 12 రకాల «ద్రువీకరణ పత్రాలను దరఖాస్తు చేసుకున్న అరగంటలోనే (సంతకాలు పూర్తయ్యాక) జారీ చేసేలా కొత్త ప్రాజెక్టు చేపట్టనున్నారు. చిత్తూరు, ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో దీనిని పైలెట్ ప్రాజెక్టుగా చేపడతారు. పాలనపరమైన కార్యకలాపాలనూ పూర్తిగా ఆన్లైన్ పరిధిలోకి తీసుకురానున్నారు. రెవెన్యూ మంత్రి నుంచి సీసీఎల్ఏ, ముఖ్య కార్యదర్శి, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ, ఆర్డీఓ, తహసిల్దార్ వరకు ప్రత్యేక అధికారిక ఈ-మెయిల్ ఖాతాలను తెరుస్తారు. ప్రభుత్వ ఆదేశాలు, సర్క్యూలర్లు, కీలక సమాచారాన్ని ఈ-మెయిల్ ద్వారానే పంపిస్తారు. సమాచారం వచ్చినట్లు వెంటనే మొబైల్లో సంకేతం అందుకునే ఏర్పాట్లు చేస్తారు. ఆన్లైన్ సంతకాలు చేయడానికి అధికారులకు డిజిటల్ సిగ్నేచర్ యంత్రాలను కూడా పంపిస్తారు. అలాగే, భూముల రికార్డులనూ ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తారు. పాస్ పుస్తకాలను కూడా పూర్తి స్థాయిలో కంప్యూటరైజ్డ్ చేస్తారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పాస్ పుస్తకాలు అందించాలని, చేతిరాతతో ఉన్న వాటిని నిషేధిస్తారు.
No comments:
Post a Comment